Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటమి భయం పట్టుకుంది. ఈ సారి ఎన్నికల్లో తాను ఓడిపోతే ఏం జరుగు తుందో ఊహించగలరా? తాను దేశాన్ని వీడి వెళ్లాల్సిరావొచ్చు అని ఉద్వేగంతో అన్నారు. ఆ వెంటనే తన ప్రత్యర్థి బిడెన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియాలోను, ఫ్లోరిడాలోను ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డెమొక్రటిక్ ప్రత్యర్థి జో బిడెన్కు అధికారమిస్తే ఆయన ఈ దేశానికి కమ్యూనిజాన్ని ఇస్తారని. క్రిమినల్ వలసదారులు దేశంలోకి పోటెత్తు తారని ట్రంప్ తన అక్కసునంతా వెళ్లగక్కారు. కరోనా వైరస్ మహ మ్మారి నుంచి అమెరికన్లను కాపాడడంలో ట్రంప్ ఘోరంగా విఫలమ య్యారు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్వేషంతో కూడిన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆయనలోని అసహనానికి అద్దం పడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓడిపోతే, దేశం వీడి వెళ్లాల్సి రావచ్చు అని చెప్పడం ద్వారా ట్రంప్ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టయిందని వారు పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికలకు మరో 18 రోజులు మాత్రమే మిగిలి వుండటంతో ట్రంప్ కాలు కాలిన పిల్లిలా చిందులు తొక్కుతు న్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీల్సన్ రేటింగ్స్ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం.. 1.41 కోట్ల్ల మంది బిడెన్ ప్రచారాన్ని చూడగా, 1.35 కోట్ల మంది మాత్రమే ట్రంప్ ప్రచారాన్ని వీక్షించారు.