Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్లో మూడో దశ ప్రయోగాలు
బ్రసీలియా : చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా సురక్షితమైనదేనని వెల్లడైంది. ఈ మేరకు బ్రెజిల్కు చెందిన ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రమైన సావోపాలో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ ప్రకటన విడుదల చేసింది. మూడో దశ క్రినికల్ ట్రయల్స్లో భాగంగా తొమ్మిది వేలమంది వాలంటీర్లపై రెండు డోసులుగా ఈ టీకాను ఇచ్చామని, ఎవరూ అస్వస్థతకు గురి కాలేదని ఇనిస్టిట్యూట్ ఉన్నతాధికారులు తెలిపారు. బ్రెజిల్ చివరి దశకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు వెల్లడికావడంతో ఈ దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది. వ్యాక్సిన్ మొదటి డోసు అనంతరం ఇంజెక్షన్ కారణంగా 20 శాతం మందిలో కొద్దిపాటి నొప్పి, 15 శాతం మందిలో తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్టు వెల్లడించారు. రెండో డోసులో 10 శాతం మందికి మాత్రమే తలనొప్పి, 5 శాతం మందికి అలసట, వికారం, కొద్దిగా కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు. అయితే ట్రయల్స్లో పాల్గొంటున్న 15 వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయిన తరువాతే వైరస్ కట్టడిలో వ్యాక్సిన్ సమర్థతకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని బుటాంటన్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, 2021 ప్రారంభం నుంచి ప్రజలందరికీ దాన్ని అందివ్వాలని భావిస్తున్నామని సోవపాలో స్టేట్ హెల్త్ సెక్రటరీ తెలిపారు.