Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల కార్యకర్తల అరెస్టులపై యూఎన్ హ్యూమన్ రైట్స్ హై కమిషనర్
జెనీవా : భారత్లో హక్కుల కార్యకర్తల అరెస్టులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్ బాచిలెట్ స్పందించారు. ఈ విషయంపై ఆందోళ వ్యక్తం చేశారు. అలాగే భారత్లోని ఎన్జీఓలకు విదేశాల నుంచి అందే నిధులపై ఆంక్షలు విధించడం పట్ల కూడా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. అరెస్టయిన హక్కుల కార్యకర్తలకు, ఎన్జీఓలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆమె కోరారు. హక్కుల కార్యకర్తల గొంతులను అణచివేయడానికే కొన్ని చట్టాలు వినియోగించ బడుతున్నాయనీ, వీటిపై తాను ఆందోళన చెందుతున్నానని ఆమె అన్నారు. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో కేంద్రం తీసుకొచ్చిన సవరణల పట్ల తాను బాధపడుతున్నాని తెలిపారు. కాగా, యూఎన్ హై కమిషనర్ చేసిన వ్యాఖ్య లను తాము చూసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. చట్టం నిబంధనలు, స్వతంత్య్ర న్యాయవ్యవస్థ ఆధారంగా భారత ప్రజాస్వామ్యం ఉన్నదనీ, భారత్లో చట్టాల రూపకల్పన సార్వభౌమ హక్కు అని ఆయన తెలిపారు.