Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనోయి : సెంట్రల్ వియత్నాంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలు, కొండచరియలు విరగిపడటంతో అక్టోబర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు సెంట్రల్ వియత్నాంలో 114 మంది మరణించినట్లు సహజవిత్తు నివారణ, నియంత్రణ కమిటీ, సెంట్రల్ స్టీరింగ్ కమిటీ గురువారం తెలిపింది. మరో 21 మంది గల్లంతైనట్లు వెల్లడించింది. ప్రధానంగా క్వాంగ్ ట్రై, తువా థియన్ హ్యూ, క్వాంగ్ నామ్ ప్రాంతాల్లో ఎక్కువ మంది చనిపోయినట్లు కమిటీ పేర్కొంది. హా టిన్హ్, క్వాంగ్ బిన్హ్, క్వాంగ్ ట్రై ప్రాంతాల్లోని 59,300 నివాసాల నుండి 2,06,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హా టిన్హ్, క్వాంగ్ బిన్లలో సుమారు 46,800 నివాసాలు కొట్టుకుపోయాయని, 6,91,100కు పైగా పశువులు కొట్టుకుపోయాయని అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిబిరాల్లోని ప్రజలకు అవసరమైన వస్తువులను అందిస్తున్నట్లు వియత్నాం పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.