Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల వెల్లువ కొనసాగుతున్నది.2018లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. 11ప్రతిపక్షపార్టీలు ఐక్యతతో ఏర్పడిన పాకిస్తాన్ ప్రజాస్వామిక ఉద్యమం(పీడీఎం) ఈ నిరసనలకు నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం విఫలమైందని, సైన్యం చేతిలో కీలుబొమ్మలా మారిందని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే రెండు భారీ స్థాయీ నిరసన బహిరంగ సభలు జరిగాయి.ఈ సంవత్సరం మరో నాలుగు నిరసన బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల సమస్యలు, ఆహారపదార్థాల కొరత, ధరల పెరుగుదల, వంటగ్యాస్ పంపిణీలో కొరత అనేవి ప్రజలను వేధిస్తున్న తక్షణ సమస్యలు. వీటిపి పరిష్కరించేందుకు ప్రయత్నం లేకుండ ప్రభుత్వ నిరసనకారులపై తీవ్ర నిర్భంద ప్రయోగిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతిపక్షనాయకులపై కేసులు పెడుతున్నారు. మాజీ అధ్యక్షులు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ జరదారీపై కేసులు పెట్టి ఆయన ప్రస్తుతం లండన్లో ఉంటే అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆయనన అప్పగించాలని కోరుతున్నారు. మాజీ ప్రధాని నవాజ్షరీప్ కూతురు మరియమ్ షరీప్పై ఒత్తిడి తెచ్చేందుకు ఆమె భర్తను అరెస్టు చేశారు. పీడీఎం నిర్వహిస్తున్న సభలలో రెండోతరం నాయకులు మరియమ్షరీప్, బిలావల్భుట్టో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై తీవ్ర ఒత్తిడిపెంచుతున్నారు. అరెస్టుపై నివేదిక ఇవ్వాలని కోరడంతో పరిస్థితులు కొంత అదుపులో ఉన్నాయి.