Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూఎన్: 75 అక్టోబర్ 24న ఆవిర్భవించిన ఐక్యరాజ్యసమితి 75 ఏండ్లు పూర్తి చేసుకున్నది. యుద్ధాలు, నివారించి, ప్రపంచ శాంతిని కాపాడాలని, ప్రపంచ ప్రజల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెంచాలని, సుస్థిర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడ్డది. తొలిదశలో 51 దేశాలు సభ్యులుగా ఉన్న దశ నుంచి 193 దేశాలు ప్రస్తుతం సభ్యత్వం పొందాయి. శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలకు వీటో అంటే తిరస్కరించే అధికారం ఉంటుంది. అవి ఆమెరికా, రష్యా, బ్రిటన్, ప్రాన్స్, చైనా . ఐక్యరాజ్యసమితిలో పని చేసే సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ, విద్యా, వైజ్ఞాన సంస్థ, బాలకార్మిక నిర్మూలనా సంస్థ, ప్రపంచ వాతారణ సంస్థ, వీటిలో ముఖ్యమైనవి. ఇవి ప్రపంచ ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక ప్రమాణాలు పెంచడానికి విశేషమైన కృషి చేస్తున్నాయి. వివిధ దేశాలలో అంతర్యుద్ధ సమయాలలో సహాయం అందించటమే గాక, శాంతి దళాలలను పంపించింది. ఇథియోఫియా ,సూడాన్, రువాండా, సోమాలియా, మయన్మార్ లాంటి దేశాలలో ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు శాంతి స్థాపనలో ముఖ్యపాత్ర పోషించాయి. పాలస్తీనా సమస్య పరిష్కారం, ఇరాక్ సంక్షోభం,ఆప్ఘానిస్తాన్ సంక్షోభం మొదలైన వాటిలో సమర్థవంతంగా వ్యవహించలేకపోయింది. ఏకధ్రువ ప్రపంచంగా మారిన స్థితిలో అమెరికా ప్రపంచ పోలీసుగా మారి ఇరాక్, లిబియా, ఇరాన్ లాంటి దేశాలపై ఆంక్షలు విధిస్తూ తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి అమెరికాను కట్టఇ చేయలేకపోయింది. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొవటంలో ఐక్యరాజ్యసమితి బహుళపక్ష వేదికగా మారవలసిన అవసరమున్నది. ప్రపంచ శాంతి, పర్యావరణం, ఉగ్రవాదం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన,కరోనా వంటి వ్యాధులు, జాతులు మధ్య ఘర్షణలు మొదలైన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితిని మరింత సమర్థవంతంగారూపొందించాల్సిన అవసరం ఉన్నది.