Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహరాన్, బాకూ : అజర్ బైజాన్, ఆర్మేనియాతో గల సరిహద్దు పొడవునా తాము బలగాలు మోహరించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆదివారం తెలిపింది. కొన్ని యూనిట్ల బలగాలను అక్కడకు పంపామని రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ పాక్పోర్ తెలిపారు. జాతి ప్రయోజనాలను కాపాడడం, శాంతి భద్రతలను పరిరక్షించడం ఆ బలగాల బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్ తన పొరుగు దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుందని, అయితే, సరిహద్దు భౌగోళిక రాజకీయాల్లో ఏ మాత్రం మర్పు వున్నా సహించబోదని స్పష్టం చేశారు. శనివారం సరిహద్దు ఖొడా అఫరిన్ కౌంటీని కమాండర్ సందర్శించారు.. నాగొర్నొ-కరబాక్ ప్రాంత ఘర్షణల కారణంగా సరిహద్దు ఆవల పేల్చిన మోర్టార్ల కాల్పుల వల్ల ఖొడా అఫరిన్, సమీప గ్రామాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇటువంటి కాల్పులు పునరావృతమైతే, ఇరాన్ చూస్తూ వూరుకోదని ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రతినిధి హెచ్చరించారు. నాగొర్నొ-కరబాక్ ప్రాంతంలో సెప్టెంబరు 27న ఘర్షణలు చెలరేగినప్పటి నుండి ఇప్పటికి రెండుసార్లు రష్యా మధ్యవర్తిత్వంలో కాల్పులు విరమణలు కుప్పకూలాయి. గత శుక్రవారం అమెరికా ఆధ్వర్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో శాంతి చర్చలు జరిగిన వెంటనే మళ్ళీ అక్కడ ఘర్షణలు చెలరేగాయి.