Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : ప్రజాస్వామ్యయుతమైన, న్యాయమైన, సమానత్వం కలిగిన అంతర్జాతీయ వ్యవస్థను పెంపొందించడంలో ఐక్యరాజ్య సమితి ప్రాముఖ్యతను క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ నొక్కి చెప్పారు. స్థిరమైన రీతిలో అభివృద్ధిని పెంచడానికి బహుళ పక్ష సంస్థ అవసరమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏ సూత్రాలు, విలువల కోసం ఏర్పడిందో వాటిని ఐక్యరాజ్య సమితి ప్రోత్సహించాలని, ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం ఇది తప్పనిసరని, శాంతి, స్థిరమైన అభివృద్ధి, అందరికీ న్యాయం వంటి డిమాండ్లకు స్పందించేలలా సమానత్వంతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ వుండాలని డియాజ్ ట్వీట్ చేశారు. ఐరాస 75వార్షికోత్సవాల సందర్భంగా ఆ నిబంధనావళికి కట్టుబడాల్సిన ఆవశ్యకతను ఆయన ఇటీవలనే నొక్కి చెప్పారు. ప్రస్తుతం సంక్లిష్టంగా వున్న పరిస్థితుల్లో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడానికి బహుముఖవాదమే సరైనదని, దానికి క్యూబా కట్టుబడి వుందన్నారు. ఘర్షణలు, ఆయుధాల పోటీలను, దురాక్రమణ చర్యలను, యుద్ధాలను నివారించడానికి మరిన్ని ఆచరణాత్మక చర్యలు అవసరమని అన్నారు.