Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది తిరుగుబాటుదారుల మృతి
బీరూట్: వాయువ్య సిరియాలో చోటుచేసుకున్న వైమానిక దాడిలో 50 మందికి పైగా తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 70 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని తిరుగుబాటు వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ వైమానిక దాడి రష్యా జరిపి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఇడ్లిబ్ ప్రావిన్స్లోని వాయువ్య భాగంలోని తిరుగుబాటు దారుల శిక్షణ స్థావరం ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. కాగా, సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని పర్యవేక్షించే బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా జరిగిన వైమానిక దాడిలో దాదాపు 78 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారనీ, 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. కాగా, సిరియాలో తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న చివరి అతిపెద్ద నగరం ఇడ్లిబ్. ఆ దేశ అధ్యక్షుడిని గద్దె దించేందుకు తిరుగుబాటుదారులు ఏడేండ్లుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.