Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు లాక్డౌన్ విధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం యోచిస్తోందని మీడియా తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రావచ్చు. కానీ ఇంతవరకు ప్రకటనేమీ వెలువడలేదని బిఎఫ్ఎం టీవీ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన ఆంక్షల కన్నా చాలా వెసులుబాటు ధోరణిలోనే లాక్డౌన్ వుండవచ్చునని భావిస్తున్నట్లు పేర్కొంది. వైరస్ను ఎదుర్కొనే చర్యలను అధ్యక్షుడు ప్రకటిస్తారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం కొవిడ్ కేసుల పెరుగుదలకు యూరప్ కేంద్ర బిందువుగా మారింది. కానీ ఈ సంక్రమణను అదుపులోకి తీసుకురావాల్సి వుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గత వారంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో 46శాతం, మరణాల్లో మూడో వంతు యూరప్ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ చెప్పారు.