Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది అమెరికా, ఇజ్రాయిల్ పనే : ఇరాన్ విదేశాంగ మంత్రి
టెహ్రాన్: అణు సాంకేతిక పరిజ్ఞానంలో సీనియర్ ఇరానియన్ నిపుణుడు మొహసేన్ ఫక్రీజా దేను శుక్రవారం ఉగ్రవాదులు హత్య చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఈశాన్యంగా 40 కి.మీ దూరంలోని డామావండ్ కౌంటీలో అబెస్టర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అణు నిపుణుడు మొహసేన్ కారులో వెళ్తుండగా ఆ మార్గంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన నిసాన్ సెడాన్ వాహనాన్ని పేల్చారు. అనంతరం ఆయన కారుపైన, అంగరక్షకులపైన కాల్పులకు లంకించుకున్నారు. ఈ ఉగ్రవాద దాడికి అమెరికా, ఇజ్రాయిలే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిని ఖండించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ను ఇరాన్ కోరింది. ఈ నీచమైన దాడిని ఖండించడంలో ఇయు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సిగ్గు చేటు అని ఇరాన్ విదేశాంగమంత్రి జావెద్ జరీఫ్ పేర్కొన్నారు. ఇరానియన్ అణు నిపుణుడి హత్యకు సంబంధించిన కుట్రకు కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం ఉన్నట్లు పరిశీలకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.