Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2.64 లక్షలకు పైగా కరోనా మరణాలు
వాషింగ్టన్ : అమెరికాలో శుక్రవారానికి కోవిడ్ కేసులు కోటీ 30లక్షలకు చేరుకున్నాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్ (సీఎస్ఎస్ఈ) తెలిపింది. కరోనా కేసులు 1,30,47,202కి చేరగా, మరణాలు 2,64,624కి చేరాయని సీఎస్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. దేశంలో టెక్సాస్లో అత్యధికంగా అంటే 12,06,248 కేసులు నమోదు కాగా, తర్వాతి స్థానంలో కాలిఫోర్నియా (11,79,857 కేసులు) నిలిచింది. ఫ్లోరిడాలో 9,70,020, ఇలినాయిస్లో 7,05,063, న్యూయార్క్లో 6,28,375 కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షలు కేసులు దాటిన రాష్ట్రాల్లో జార్జియా, ఓహియో, విస్కాన్సిన్, మిచిగన్, టెన్నెసీ, ఉత్తర కరోలినా ఉన్నట్టు సీఎస్ఎస్ఈ డేటా తెలిపింది.ప్రపంచంలో కరోనాతో ఎక్కువగా దెబ్బ తిన్న దేశంగా అమెరికా వుంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక కేసులు, అత్యధిక మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. నవంబరు 9 నాటికి కేసులు కోటి దాటాయి. ఆతర్వాత సగటున ఆరు రోజులకు 10లక్షల కేసులు చొప్పున నమోదవుతూ వచ్చాయి. నవంబరు ప్రారంభం నుండి చూసినట్లైతే గురువారం లక్ష కేసులకు పైగా దాటడం వరుసగా ఇది 25వ రోజు. ఆరోగ్య శాఖ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా గతవారం రోజులుగా లక్షలాదిమంది అమెరికన్లు విమాన ప్రయాణాలు చేస్తూ దేశమంతా తిరిగేస్తున్నారు.c