Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతి తక్కువ కాలంలో మళ్లీ సాధారణ జనజీవితానికి..
- ప్రస్తుతం అక్కడ జీరో కేసులు
బీజింగ్ : అతి తక్కువ కాలంలోనే కరోనా వైరస్ను చైనా నియంత్రించడంపై ప్రపంచ దేశాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా మిగిలిన దేశాలు ఇంకా లాక్డౌన్ నియమాలు అమలు చేస్తున్నాయి. చైనా మాత్రం అతి తర్వగా సాధారణ జనజీవితం పున ప్రారంభించింది. జూన్, జులైలోనే ప్రజలు తమతమ పనులకు తిరిగి వెళ్లారు. పాఠశాలలు, కళాశాలలు ఆగస్టులోనే చైనా ప్రారంభించింది. అక్టోబర్ జాతీయ సెలవుదినం సందర్భంగా దేశీయ పర్యాటక రంగంలో కూడా పెరుగుదల కనిపించింది. ఇది కరోనాకు ముందురోజులతో సమానంగా ఉంది. 140 కోట్లు జనాభా ఉన్న దేశంలో ఇది ఎలా సాధ్యమైందని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో ఉన్నాయి. చైనా అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 86 వేల కరోనా కేసులు 4,600 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే చైనా ప్రభుత్వం కరోనా కేసులు, మరణాలను దాచిఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
ఇతర విషయాలతో పాటు, చైనా సాధారణ స్థితికి రావడం, పాఠశాలలు తెరవడం, దేశీయ ప్రయాణాల్లో వృద్ధి.. వంటి విషయాలను చైనాలో పనిచేస్తున్న విదేశీ విలేకరులు తమ వ్యక్తిగత, స్వతంత్ర ఖాతాల గురించి ఎప్పటికప్పుడు వార్తలు వెల్లడిస్తున్నారు.
దీంతో చైనా వైరస్ను ఎలా నియంత్రించింది అనేది కోవిడ్-19పై యుద్ధంలో ఒక విషయంగా మారింది. చైనాలో కూడా జనవరి 23 నుంచి ఏప్రిల్ 16 వరకూ లాక్డౌన్ కొనసాగింది. దీనిని అక్కడి అధికారులు అత్యంత పకడ్బందీగా అమలు చేశారు. చైనాలో ఫిబ్రవరి నాటికి కేసులు గరిష్ట స్థాయికి చేరాయి. అయితే సమర్థవంతమైన పరీక్షలు, ట్రేస్ వ్యవస్ధలతో వేసవి నాటికి కేసులను సున్నాకి తీసుకునివచ్చారు. ఈ తరువాత చైనాలో కేసులు నమోదైనా వాటిలో ఎక్కువ భాగం విదేశాల నుంచి వచ్చినవే. చైనాలో కేసులను నియంత్రించడంలో సామూహిక పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ముఖ్య పాత్ర పోషించాయి. ఫిబ్రవరిలో రోజుకు 2 వేల పరీక్షలు చేస్తే.. ప్రస్తుతం రోజుకు సుమారు 2.6 లక్షల పరీక్షలు చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రయాణాలపై చైనా కఠినంగా వ్యవహరిస్తుంది. విమానాల సంఖ్యను పరిమితం చేయడం, ప్రతీ విదేశీ ప్రయాణికుడికి 14 రోజుల క్వారంటైన్ ఖచ్చితంగా అమలుచేస్తుంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చిన చైనా వెనక్కితగ్గలేదు. అలాగే ప్రజలు మాస్క్ ఉపయోగం కూడా వైరస్ను నియంత్రించడంలో ఎంతో సహాయం చేసింది. మాస్క్లపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించింది. ఫిబ్రవరి ఆరంభం నుంచే మాస్క్లపై అవగాహన కల్పించడం, ఉపయోగించడం విరివిగా ప్రారంభయింది. లక్షణం లేని కేసులకు కూడా బలవంతపు నిర్భంధం, అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు, మొత్తం నగరాల్లో సామూహిక పరీక్షలు.. వంటి చర్యలతో చైనా ప్రభుత్వం కరోనాను సున్నా స్థాయికి తీసుకుని వచ్చింది. చైనా ప్రభుత్వ చర్యలకు ప్రజల మద్దతు కూడా తోడు కావడంతో ఆ దేశం తర్వగా వైరస్ నుంచి కోలుకుంది. మళ్లీ కరోనా ముందు నాటి సాధారణ స్థితికి చేరుకుంది.