Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలో ఢిల్లీ
లాహౌర్ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో పాక్ సాంస్కృతిక రాజధాని లాహోర్ అగ్ర స్థానంలో నిలిచింది. వాయు కాలుష్యానికి సంబంధించి అమెరికా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం లాహోర్ మొదటి స్థానంలో వుంది. గాలిలో కాలుష్య కారక కణాల సంఖ్య 423గా వుంది. ఇక భారత్ రాజధాని న్యూఢిల్లీ 229 పార్టిక్యులేట్ మేటర్(పిఎం)తో ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. 178 పిఎంతో ఖాట్మండు మూడవ స్థానంలో వుంది. పాక్ ఆర్థిక రాజధాని కరాచి ఏడవ స్థానంలో వుంది. ఎక్యుఐ 50లోపు వుంటే గాలి నాణ్యత సంతృప్తికరంగా వున్నట్లు అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ పరిగణిస్తుంది. లాహోర్లో ఎక్యుఐ 301గా వుంది. అంటే చాలా ప్రమాదకర స్థితి అని భావిస్తారు. పాత సాంప్రదాయ రీతుల్లోనే ఇప్పటికీ ఇక్కడ 162 ఇటుక బట్టీలు పనిచేస్తున్నాయి. ఇటీవలే దాదాపు 80 వరకు కొత్త సాంకేతికతకు మారాయి. డిసెంబరు 31 వరకు మూసివుండేలా ఆదేశాలు జారీ చేస్తూ నవంబరు 7వ తేదీన ఇటుక బట్టీలను మూసివేశారు. వాటిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొన్ని ఇంకా రాత్రుళ్ళు కూడా పనిచేస్తూనే వున్నాయి.