Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : బౌద్ధం, హిందు, సిక్కుమతాలపై హింస, ద్వేషాన్ని గుర్తించడంలో ఐరాస సాధారణ అసెంబ్లీ (యూఎన్జీఏ) విఫలమైందని భారత్ ఆరోపించింది. శాంతి సంస్కృతి అనేది కేవలం 'అబ్రహమిక్ మతాల'కు మాత్రమే ఉండకూడదని స్పష్టం చేసింది. 'శాంతి సంస్కృతి' పై జరిగిన యూఎన్జీఏ సెషన్లో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. 'ప్రస్తుత ప్రపంచంలో అస్పష్టత పోకడలు ఉన్నాయి' అని ఐరాసలో భారత కార్యదర్శి ఆశిష్ శర్మ అన్నారు. బౌద్ధం, హిందు, సిక్కు మతాలపై హింసను కూడా ఐరాస ఖండించాలని తెలిపారు.