Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : క్యూబా, వియత్నాం మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని ఇరు దేశాల సీనియర్ నేతలు బుధవారం ఉత్సాహంగా జరుపుకున్నారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పీసీసీ) ఫస్ట్ సెక్రటరీ, ఆర్మీ జనరల్ రాల్ కాస్ట్రో, వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు గుయెన్ ఫూ ట్రాంగ్లు మంగళవారం టెలిఫోన్లో సంభాషించుకున్నారని బుధవారం ఇక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. ఇరు దేశాల మధ్య స్నేహాన్ని, సంఘీభావాన్ని, ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని ఇరువురు సీనియర్ నేతలు పునరుద్ఘాటించారు. క్యూబా తన ఆర్థిక, సామాజిక నమూనాను ప్రక్షాళన చేసే క్రమంలో సాధించిన పురోగతికి క్యూబాను ట్రాంగ్ అభినందించారు. కరోనాపై పోరులో క్యూబా విజయాలను కూడా ఆయన ప్రశంసించారు. ఇదిలావుండగా, క్యూబాకు బేషరతుగా మద్దతిస్తున్నందుకు ముఖ్యంగా అమెరికా ఆర్థిక, వాణిజ్య, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనడంలో ఇస్తున్న తోడ్పాటుకు వియత్నాం ప్రజలకు పీసీసీ ఫస్ట్ సెక్రెటరీ కృతజ్ఞతలు తెలిపారు. ఫైడెల్ కాస్ట్రో, హౌచిమిన్లు నెలకొల్పిన చారిత్రక సోదర సంబంధాలను మరింత బలోపేతం చేయడాన్ని కొనసాగించాలని రాల్ కాస్ట్రో, గుయెన్ ఫూ ట్రాంగ్లు ధ్రువీకరించారు.