Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్కీ, అమెరికా వర్కింగ్ గ్రూపు ఏర్పాటు
అంకారా : రష్యా అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ ఎస్-400ని కొనుగోలు చేసినందుకు టర్కీపై అమెరికా విధించిన ఆంక్షలపై ఇరు దేశాలు చర్చించేందుకు ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కవుసొగ్లు బుధవారం తెలిపారు. ఇరు దేశాల నిపుణులతో వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అమెరికా నుండే వచ్చిందని చెప్పారు. చర్చలకు తాము సిద్ధమైనందున ఈ ప్రతిపాదన అంగీకరించామని చెప్పారు. చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంతో టర్కీ ఆరో గ్యకరమైన సంబంధాలను కోరుకుంటోందని టర్కీ మంత్రి పేర్కొన్నారు. రష్యా వ్యవస్థను కొనుగోలు చేసినందుకు గానూ ఈ నెల ఆరంభంలో టర్కీపై ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి అమెరికా చట్టం కాట్సా కింద ఈ ఆంక్షలు విధించారు. అమెరికా తన మిత్ర పక్షంపై ఈ చట్టాన్ని ఉపయోగించడం ఇదే ప్రధమం. రష్యా అధ్యక్షుడు, మరో ముగ్గురు సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించారు.