Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంథోనీ ఫౌసి ఆందోళన
వాషింగ్టన్ : అమెరికాలో పరిస్థితి అదుపులో లేదని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసి మంగళవారం వ్యాఖ్యానించారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు వీటన్నింటి కారణంగా పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగో విడతలో భాగంగా అమెరికాలో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని చెప్పారు. అమెరికాలో ఇప్పటివరకు తక్కువ కేసులు నమోదు కావడం లేదనీ, అందువల్ల పరిస్థితి చాలా క్లిష్టంగా వుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగా చాలా కీలకమైన దశలో వున్నామనీ, రానున్న కొద్ది వారాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా మారవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరమనీ, అనవసరపు ప్రయాణాలు చేయవద్దని, ఇన్డోర్ సమావేశాలు కూడదనీ, ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో ఇండ్లల్లో ఎక్కువమంది గూమిగూడవద్దని ఫౌసి సూచించారు. అమెరికాలో సోమవారం 1,21,235 మంది కరోనా రోగులు ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 22,592మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో వున్నారు.