Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
- సంతకం చేసిన బోరిస్ జాన్సన్
లండన్ : యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. హౌస్ ఆఫ్ కామన్స్లో బిల్లుకు అనుకూలంగా 521 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 73 మంది ఓటు వేశారు. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా విడిపోనుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతకం చేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఆమోదం పొందిన బిల్లు బ్రిటన్రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాల్చనుంది. ఈయూ ఏకీకత మార్కెట్ నుంచి బ్రిటన్ నిష్క్రమించనుంది. జనవరి ఒకటి నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. నిష్క్రమణ అనంతరం కూడా బ్రిటన్ నుండి జరిగే వ్యాపారాలకు టారిఫ్లు ఉండకూడదని ఇయు నిర్ణయించింది. అంటే బ్రిటన్కు, వివిధ యూరోపియన్ దేశాలకు మధ్య జరిగే వాణిజ్య వ్యవహారాలపై ఎటువంటి పన్నులు విధించరు. గతంలో మాదిరిగానే స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది. బ్రెగ్జిట్పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత యూకే సంబంధాలను తెంచుకున్నది. ఐరోపా సమాఖ్యతో తమకు ఎలాంటి లాభం లేకపోగా.. ఆర్థిక భారం పడుతోందని యూకే ఆరోపిస్తుంది. ఒప్పందంపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషనర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సభతో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతు పలికిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గొప్ప దేశం విధులు ఇకపై మన చేతుల్లోనే ఉంటాయని అన్నారు. బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా జరిగిన చర్చలో సర్ కైర్ తన గళం వినిపించారు. ఒప్పందంపై ప్రధాని ప్రజలతో నిజాయితీగా లేరని ఆరోపించారు. అయితే ఈయూలో ఉన్నదానికంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.