Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ దేశాలు పరస్పరం ఖైదీల జాబితాను శుక్రవారం అందజేసుకున్నాయి. పాకిస్తాన్ అంద చేసిన జాబితా ప్రకారం ఆ దేశంలో 319 భారతీయ ఖైదీలు ఉన్నారు. ఇందులో 49 మంది పౌరులు, 270 మంది జాలర్లు ఉన్నారు. ఇస్లామా బాద్లోని భారత రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ జాబితాను అందజేసింది. అలాగే భారత్ ప్రభుత్వం కూడా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్కు ఖైదీల జాబితాను అందచేసింది. భారత ప్రభుత్వం అందచేసిన జాబితా ప్రకారం దేశంలో 340 మంది పాకిస్తాన్కు చెందిన ఖైదీలు ఉన్నారు.