Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : జో బైడెన్ బృందంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి లభించింది. అటార్నీ జనరల్గా భారతీయ -అమెరికన్ న్యాయవాది వనితా గుప్తా (46)ను బైడెన్ ఎంపిక చేశారు. సెనెట్ కనుక ఆమె నియామకాన్ని ధ్రువీకరిస్తే.. కీలక బాధ్యతలు చేపట్టనున్న తొలి శ్వేతేతర మహిళగా వనితా గుప్తా నిలుస్తారు. వనిత మొదట ఎన్ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యాయశాఖలోని పౌర హక్కుల విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. ఇదిలావుండగా వైట్హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సింగ్ నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో కమల హారీస్కు ప్రెస్ సెక్రటరీగా ఆమె వ్యవహరించారు.