Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జెరుసలేం
ఇజ్రాయిల్ ప్రభుత్వం తన ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో ఓ వైపు ముందంజలో ఉన్నది. ఇప్పటిదాకా దేశ జనాభాలో 16 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. అక్కడ వైద్యారోగ్య వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఉండటంతోనే సాధ్య మైందని చెబుతున్నారు. ఒక్కో వ్యాక్సిన్ డోస్కు 28 డాలర్లు చెల్లిస్తున్నారు. అమెరికాలో 1.67 శాతం మందికే వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, అదే సమయంలో ఇజ్రాయిల్ వివక్షనూ ప్రదర్శిస్తున్నది. ఆ దేశ జనాభా 90 లక్షలు. అందులో 20 శాతం మంది పాలస్తీయన్లు. వారికి అక్కడ ఓటు హక్కు ఉంది. వీరికి మాత్రమే ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తున్నది. వీరుకాక ఆదేశంలో మరో 50 లక్షల మంది పాలస్తీయన్లు ఉన్నారు. వారికి అక్కడ ఓటు హక్కు లేదు. దీంతో వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇజ్రాయిల్ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ఇలా చేయటం వల్ల వారి ప్రాణాలకు హాని జరిగే అవకాశం ఉన్నది. ఇజ్రాయిల్ ప్రభుత్వం మహా విపత్తు సమయంలోనూ జాతి వివక్ష పాటించడం అవాంఛనీయం.