Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంతపార్టీకి చెందిన 10 మంది సభ్యుల మద్దతు
- 19న సెనెట్ సమావేశం..
- ఆమోదానికి డెమొక్రాట్ల 17 ఓట్లు అవసరం..
న్యూయార్క్ : 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్ ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ప్రతినిధుల సభలో 232-197 ఓట్లతో అభిశంసన తీర్మానం నెగ్గింది. ట్రంప్ సొంత పార్టీకి చెందిన 10మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. నలుగురు కాంగ్రెస్ సభ్యులు ప్రతినిధుల సభలో ఓటింగ్లో పాల్గొనలేదు. నలుగురు ఇండో అమెరికన్ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు. ఈ తీర్మానంపై సెనెట్ ఓటింగ్ నిర్వహించనున్నది. సెనెట్లో ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. సెనెట్ ఈనెల 19కి వాయిదా పడింది. సెనెట్లో ఆమోదం పొందడానికి డెమొక్రాట్లకు 17 ఓట్లు అవసరం. మరో వైపు ట్రంప్పై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఈనెల 20న సెనెట్లో చర్చ జరగనుంది. అదే రోజు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. జోబైడెన్ గెలుపును ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.