Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్వే : నార్వేలో కరోనా వ్యాక్సిన్ వికటించి మరణించిన వారి సంఖ్య నేటికి 29కి చేరుకుంది. శనివారం ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారని నార్వే ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలి సిందే. ప్రపంచంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అమెరికా ఫైజర్ టీకా ను రిలీజ్ చేసింది. ఫైజర్ టీకాపై ప్రపంచం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఫైజ ర్ టీకా సమర్ధత కూడా 95 శాతం వరకు ఉన్నట్టు ట్రయల్స్లో తేలింది. అమెరికా లో తయారైన ఈ ఫైజర్ టీకాను మొదటగా బ్రిటన్ ఆమోదం తెలిపింది. ఆ తరు వాత నార్వే కూడా ఫైజర్ వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. వేలాది మందికి వ్యాక్సి న్ అందించారు. వ్యాక్సిన్ తీసుకున్న అనేక మందిలో సైడ్ ఎఫెక్ట్ కనిపించాయి. శనివారం 23 మంది మరణించగా ఆ సంఖ్య ఆదివారం 29కి చేరింది. మరణిస్తున్న వారిలో 75 నుంచి 85 సంవత్సరాల వయసున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వ్యాక్సిన్లు ఆరోగ్యానికి ప్రమాదకరమని నార్వే తెలిపింది. బలహీనంగా ఉన్న వృద్ధులకు ఈ టీకాతో ప్రమాదం ఉన్నదని తెలిపింది. కాగా, వృద్ధుల మృతిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు.