Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : దక్షిణ కొరియాకి చెందిన శామ్సంగ్ కంపెనీ తాత్కాలిక చీఫ్ లీ జే యాంగ్ను అతిపెద్ద అవినీతి కుంభకోణంలో సియోల్ సెంట్రల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మెన్ అయిన లీ దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గుయాన్ హైని గద్దె దించిన కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కుంభకోణానికి సంబంధించి ఆయనపై వచ్చిన ముడుపులు, నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. విస్తృతమైన ఈ వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా తన నియామకం సాఫీగా, సజావుగా సాగేందుకు అధ్యక్ష అధికారాలను ఉపయోగిం చాలంటూ లీ అప్పటి అధ్యక్షురాలు పార్క్ గుయాన్ను కోరారు. అందుకు అవసరమైన ముడుపులు కూడా అందచేశారని సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు తన రూలింగ్లో పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన శామ్సంగ్ రాజకీయంగా మార్పు చోటు చేసుకున్నపుడల్లా ఇలా పదే పదే నేరాలకు పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. విషాద వదనంతో కోర్టు గదిలో కూర్చున్న లీ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.