Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్
న్యూయార్క్ : దశాబ్దాల తరబడి కొనసాగతున్న లిబియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ వ్యాఖ్యానించారు. భద్రతా మండలికి అందచేసిన నివేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వారాంతానికి దేశం నుండి విదేశీ బలగాలు వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొద్ది మాసాలుగా కొనసాగుతున్న లిబియా అంతర్గత రాజకీయ, భద్రతా, ఆర్థిక చర్చలు మరింత ముందుకు సాగడంలో స్పష్టమైన ప్రగతిని సాధించామని ఆ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్చలు గణనీయమైన ఉత్తేజాన్ని ఇచ్చాయని ఆ నివేదిక పేర్కొంది. రాజకీయ, భద్రత, ఆర్థిక, అంతర్జాతీయ మానవతా చట్టం, మానవ హక్కుల రికార్డు వంటి అంశాల్లో పురోగతి కనిపిస్తోందని, శాంతి, సుస్థిరత, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంది. లిబియా ఘర్షణలకు శాశ్వత రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలన్న కృతనిశ్చయాన్ని, దీక్షను కొనసాగించాలని ఐక్యరాజ్య సమితి సంబంధిత పక్షాలను కోరింది. ఆర్థిక సమస్యలను పరిష్కరించి, లిబియన్ల ప్రయోజనార్ధం మానవతా పరిస్థితులను చక్కదిద్దాలని కోరింది. దేశం నుంచి విదేశీ బలగాలు మూడు మాసాల్లో వైదొలగాలని పేర్కొంటూ 2020 అక్టోబరు 23న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలోని నిబంధనలను గౌరవించాలని ప్రాంతీయ, అంతర్జాతీయ పక్షాలను గుటెరస్ కోరారు.