Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసన ప్రదర్శనలు
- ఆందోళనలపై భద్రతాబలగాల ఉక్కుపాదం
టునీస్: ట్యునీషియా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గత మూడు రోజులకుపైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ ఆందోళనలను అణచివేసేలా భద్రతాబలగాలు వీరంగం సృష్టిస్తున్నాయి. లాఠీలు.. జలఫిరంగులు ప్రయోగించీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరసన కారుల్ని అరెస్టు చేశారు.
నిరసనలపై ట్యునీషియా భద్రతా దళాలు అత్యంత హింసాత్మక పద్ధతులను ఉపయోగిం చడాన్ని మానవ హక్కుల సంస్థలు ఖండించాయి. ముఖ్యంగా శాంతియుత, నిరాయుధ నిరసనకా రులపై సంయమనం పాటించాలని అధికారులను కోరాయి. ఇప్పటివరకు 632 మందిని అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఖలీద్ హయూని తెలిపారు. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది 15 నుంచి 25 ఏండ్లమధ్య వయసు కలిగిన వారే ఉండటం గమనార్హం. యువత ఎక్కువగా ప్రభుత్వ నిరసనలపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయని అవగత మవుతున్నది.ట్యునీషియా విప్లవం పురస్కరిం చుకుని.. 10 వ వార్షికోత్సవం సందర్భంగా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. నగరాల్లోని పేద, అట్టడుగు ప్రజలు, కార్మికవర్గ ప్రాంతాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఆగ్రహం వెనుక..
ట్యునీషియా లెక్కలేనన్ని ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు తోడు ఆ దేశ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో అగ్గికి కారణమైంది. గతేడాది దేశ జీడీపీలో 9 శాతం క్షీణత, పెరుగుతున్న నిరుద్యోగం, ముఖ్యంగా ముగ్గురు యువతలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నాడు. దీనికి తోడు వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అదుపులేని నిత్యావసరాల ధరలు ట్యునీషియన్లను కష్టనష్టాల పాలు జేస్తున్నాయి. వీటికి తోడు ప్రభుత్వసేవల్లో పెరిగిన అవినీతి, నిర్లక్ష్యం వెరసి ఆ దేశ జనంలో కోపాగ్నికి కారణమయ్యాయి.
కరోనావైరస్ను నియంత్రించటానికి అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కరోనా విజృంభణ భారీ ఆర్థిక క్షీణతకు దారితీసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నాయి.