Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం : గాజా స్ట్రిప్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ట్యాంకులు వరుసగా రెండో రోజూ రాత్రి కాల్పులు జరిపాయి. గాజాలోనిఒక నివాసంతో సహా పలు ప్రాంతాలపై దాడులు కొనసాగాయి. ఎవరూ మరణించకపోయినా ఆస్తి నష్టం జరిగిందని స్థానిక పాలస్తీనా వర్గాలు తెలిపాయి., మాగజి శరణార్దుల శిబిరంలోని ఒక ఇంట్లో కుటుంబం నిద్రపోతుండగా మంగళవారం రాత్రి దాడి జరిగింది. ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నా కానీ తామెవరమూ గాయపడలేదని, తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని ఆ కుటుంబ పెద్ద మీడియాకు తెలిపారు. పలు అబ్జర్వేషన్ పాయింట్లు, లొకేషన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ట్యాంకులు కాల్పులు జరిపాయి. ఇజ్రాయిల్పై రాకెట్ దాడి జరిగిందని అందుకు ప్రతిగా తాము హమస్ స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. కాగా రాకెట్ దాడికి తమదే బాధ్యత అని హమస్ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ గాజాదాడులకు తమదే బాధ్యత అని ఇజ్రాయిల్ వెల్లడించింది. సోమవారం తెల్లవారు జామున గాజా నుండి రెండు రాకెట్లు తీరప్రాంత నగరమైన అషద్పై పడ్డాయని ఇజ్రాయిల్ సైనిక వర్గాలు తెలిపాయి.