Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం
- డబ్ల్యూఈఎఫ్ రిపోర్ట్
దావోస్ : కరోనా సంక్షోభం వల్ల లక్షలాది జీవితాలు ప్రభావితం కావడమే కాకుండా.. ఈ వైరస్ అనేక సామాజిక అంతరాలను పెంచుతుందని వాల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తన గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్లో విశ్లేషించింది. ఈ పరిణామం 3-5 ఏండ్ల పాటు ఆర్థిక వ్యవస్థలను ప్రమాదాలకు గురి చేయనున్నదని తన అధ్యయనంలో పేర్కొంది. అదే విధంగా వచ్చే 5-10 ఏండ్ల పాటు భౌగోళిక స్థిరత్వాన్ని బలహీనపర్చనుందని హెచ్చరించింది. వచ్చే దశాబ్దం పాటు అంటు రోగాలు అతిపెద్ద రిస్క్ను తెచ్చిపెట్టనున్నాయని పేర్కొంది. జనవరి 25-29 తేదిల్లో జరగనున్న దావోస్ ఎజెండా సమ్మిట్ నేపథ్యంలో ముందస్తుగా డబ్ల్ల్యూఈఎఫ్ ఈ రిపోర్ట్ను విడుదల చేయడం విశేషం. ఈ వర్చువల్ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. కరోనా సంక్షోభం లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా వైద్య, ఆర్థిక, డిజిటల్ తారతమ్యాలను పెంచిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. కోట్లాది రక్షకులు, కార్మికులు, విద్యార్థులు రిస్కులో పడ్డారని తెలిపింది. ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ పరస్పర సహకారాలు ఎంతో అవసరమని గుర్తు చేసింది. ఈ సవాళ్లపై వచ్చే వారం దావాస్ ఎజెండా సమ్మిట్లో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది.
భవిష్యత్తులో మరింత అనిశ్చితి : ఐఎంఎఫ్ చీఫ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు మరింత అనిశ్చితిగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టియాన జియోర్జీవా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం వల్ల ప్రపంచంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయ న్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎంఎఫ్ మరిన్ని అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సొంత కరెన్సీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, వైద్య సంక్షోభం, డిజిటల్ రంగం పెరగడం తదిరత అంశాలపై క్రిష్టియాన మీడియాతో మాట్లాడారు. వర్థమాన, అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్ వేగంగా ఫైనాన్సీంగ్ను పెంచాలని భావిస్తోందన్నారు. అదే విధంగా ఎస్డిఆర్ కింద 20 బిలియన్ డాలర్ల సాయం అందించనున్నామన్నారు. ఈ నిధులు కీలక పాత్ర పోశించనున్నాయనీ.. అయిన్పటికీ మరిన్ని చర్యలు అవసరం అని అన్నారు. ఒత్తిడిలోని దేశాలకు తమ మద్దతును పెంచడానికి మరింత సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.