Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 మంది మృతి, 73 మందికి గాయాలు
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నడిబొడ్డున జనసమ్మర్థంతో ఎప్పుడూ రద్దీగా వుండే వాణిజ్య కేంద్రంలో గురువారం జరిగిన బాంబు పేలుళ్లలో 28మంది చనిపోయారు. మరో 73 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సైన్యం తెలిపింది. దీంతో గత కొన్నివారాలుగా నెలకొన్న ప్రశాంతత ఒక్కసారిగా చెదిరి పోయింది. బాగ్దాద్ ఆపరేషన్స్ కమాండ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ హజీమ్ అల్ అజ్వి మీడియాతో మాట్లాడుతూ, జంట పేలుళ్లతో ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాజధానికి అదనపు వైద్య నిపుణులను రప్పిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.తాయారన్ స్క్వేర్లో సెకండ్ హ్యాండ్ బట్టలకు పేరొందిన అతిపెద్ద ఓపెన్ ఎయిర్ మార్కెట్లో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ళకు తమదే బాధ్యత అనిఇంతవరకు ఏ సంస్థ ప్రకటిం చలేదు. అయితే ఇది ఐసిస్ పనే అయి వుంటుందని అనుమానిస్తున్నారు. 2003లో అమెరికా దురాక్రమణపూరిత దాడికి దిగినప్పటి నుంచి ఇరాక్లో బాంబుదాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. అమెరికా దళాలు ఇరాక్ను వీడి పోవాలని ఇరాకీయులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా మాత్రం ఇంతవరకు యుద్ధాన్ని ఆపడం కానీ, దళాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం కానీ చేయలేదు. ఇరాక్ను కబళించడం ద్వారా, అక్కడి చమురు వనరులను కొల్ల గొట్టుకుపోవాలన్నది అమెరికా పన్నాగం. దీనికి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది.