Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్ మరో కీలక నిర్ణయం!
వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ఇటీవల 15 కీలక కార్యనిర్వాహక అదేశాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. తాజా గా కరోనా మహమ్మారితో దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 1.9 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన ఆదే శంపై సంతకం చేశారు. 'ది అమెరికన్ రెస్క్యూ ప్లాన్' పేరుతో ప్రకటిం చిన ఈ భారీ ప్యాకేజీ కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశ మనం కలిగించనుందని వెల్లడించారు. దీంతో అమెరికాలోని ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు (1.46 లక్షలు) జమ కాను న్నాయి. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. కరోనా వల్ల అవస్థలు పడుతున్న పౌరులకు ఇప్పటికే 600 డాలర్లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఇవి ఏమాత్రమూ సరిపోవని బైడెన్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అద్దె ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయడంపైనా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. అతేకాకుండా 'ది అమెరికన్ రెస్క్యూ ప్లాన్'లో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి, అధిక సమయం పని చేసే వారి కనీస వేతనాల పెంపును ప్రస్తావించారు.