Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్ మ్యాప్ విడుదల చేసిన ఎస్ఎన్పి
ఎడిన్బర్గ్ : బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ స్కాట్లాండ్ రెండోసారి రెఫరెండంకు సిద్ధమౌతోంది. ఈ మేరకు స్కాటిస్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పి) శనివారం రోడ్మ్యాప్ ప్రకటించింది. ఇందులో స్కాట్లాండ్కు స్వాతంత్య్రం ఇవ్వాలని కోరుతూ మరోమారు ఓటింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు వేసింది. కాగా, ఇప్పటికే కరోనా వైరస్తో పాటు కొత్త స్ట్రెయిన్తో ఇబ్బందులు పడుతున్న బ్రిటన్కు బ్రెగ్జిట్ తర్వాత తగిలిన మరో ఎదురుదెబ్బగా దీన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రెఫరెండంను ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించాల్సి ఉంది. 2014లో నిర్వహించిన ఓటింగ్లో స్కాంట్లాండ్ ఓటర్లు స్వాతంత్య్రాన్ని తిరస్కరించారని, ఈ నేపథ్యంలో మరోమారు ఓటింగ్ అక్కర్లేదని జాన్సన్ వాదిస్తూ వస్తున్నారు. మరోవైపు మే 6న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ వస్తే సొంతంగా బిల్లును పాస్ చేస్తామని, తద్వారా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రెఫరెండం నిర్వహిస్తామని ఎస్ఎన్పి హామీ ఇచ్చింది. దీన్ని బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించడమో లేదా రెఫరెండం చట్టప్రాతిపదికను సవాల్ చేస్తూ లీగల్ చర్య తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.
అటువంటి లీగల్ ఛాలెంజ్లు ఏమైనా ముందుకు వస్తే ఎస్ఎన్పి స్కాటిష్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపింది. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్ఎన్పి మెజార్టీ సాధించే అవకాశం ఉందని పలు పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రెఫరెండంకు అనుకూలంగా ఉన్నట్లు 51 శాతం ఉత్తర ఐరిస్ ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేయగా, వ్యతిరేకిస్తున్న వారి శాతం 4 శాతం మాత్రమే ఉంది. 201లో జరిగిన రెఫరెండంలో 55-45 శాతం ఓట్ల తేడాతో స్కాట్లాండ్ ఓటర్లు స్వాతంత్య్రాన్ని తిరస్కరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. అప్పటితో పోల్చుకుంటే ఎస్ఎన్పి బలోపేతం అయింది. స్కాట్లాండ్లో జరిగిన అన్ని ఎన్నికలను భారీ మెజార్టీతో గెలుచుకుంటూ వస్తోంది. ఇటువంటి సమయంలో రెండోసారి రెఫరెండం విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.