Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా కోరేగావ్ కేసులో నిర్బంధంపై ఐరాస ఆందోళన
- హక్కుల కార్యకర్తలపై దారుణాలను ఆపండి
జెనీవా : ఇండియాలో హక్కుల కార్యకర్తలు, ముఖ్యంగా బీమా కోరేగావ్ కేసులో అరెస్టు అయినవారిని బెయిల్పై విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం కోరింది. బీమా కోరేగావ్ కేసులో హక్కుల కార్యకర్తలను జైల్లో నిర్బంధించిన తీరుపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. హక్కుల కార్యకర్తల ఆరోగ్యం, వయస్సురీత్యా పరిశీలించి వారిని
బెయిల్పై విడుదల చేయాలనీ, హక్కుల కార్యకర్తలు వరవరరావు, స్టాన్ స్వామిల పేర్లను ఐరాస పరోక్షంగా ప్రస్తావించింది. ఇండియాలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలను జైల్లో నిర్బంధించటంపై ఐరాస మానవ హక్కుల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఐరాస మానవ హక్కుల విభాగం మీడియాకు విడుదల చేసిన ప్రకటన ఈ విధంగా ఉంది.''భారత్లో మానవ హక్కుల కార్యకర్తల పరిస్థితి మమ్మల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోంది. బీమా కోరేగావ్ కేసులో అరెస్టులు సైతం తమ దృష్టికి వచ్చాయి. కేంద్ర ప్రభు త్వం నిర్బంధించిన వారిలో కొంతమంది వయస్సు రీత్యా, ఆరోగ్య పరిస్థి తులరీత్యా..వారికి బెయిల్ ఇవ్వొచ్చు''అని పరోక్షంగా వరవరరావు, స్టాన్ స్వామిలను ఐరాస ప్రస్తావించింది. బీమా కోరేగావ్ కేసులో పలువురు న్యాయవాదుల్ని, రచయితల్ని, విద్యావేత్తలను కేంద్రం జైల్లో నిర్బంధిం చింది. షోమా సేన్, సుధా భరద్వాజ్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, మహేష్ రౌత్, వెర్నాన్ గోంజాల్వ్స్, అరుణ్ ఫెరైరా, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతం నవలఖా...మొదలైనవారిని ముంబయిలోని తలోజా జైల్లో నిర్బం ధించారు. హక్కుల కార్యకర్తలను బెయిల్పై విడుదల చేయాల్సిందిగా ఐరాస భారత ప్రభుత్వాన్ని గత ఏడాది అక్టోబరులోనూ కోరింది.