Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంగాన్ : మయన్మార్ సైనిక కుట్రను నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో గాయపడిన 20ఏండ్ల మహిళ చనిపోయారు. ఈ నెల 9న రాజధాని నెపిడాలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న మియా తవాటె ఖయింగ్(20)కు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో తలకు బులెట్ గాయమైంది. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం నాడు కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆందోళనకారులపై భద్రతా బలగాలు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో నెపిడా ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆనాటి కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని డాక్టర్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 11గంటలకు మియా చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మరణ వాంగ్మూలాన్ని నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తామని వైద్యులు తెలిపారు.. ప్రస్తుతం సమాచార శాఖ డిప్యూటీ మంత్రిగా వున్న సైనిక ప్రతినిధి జా మిన్ ఈ వార్తను ధ్రువీకరిస్తూ, ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.