Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక నివేదిక విడుదల చేసిన ఐరాస దూత
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత అలెనా దౌహాన్ ఈ నెల్లో వెనిజులాలో పర్యటించి అమెరికా ఆంక్షల వల్ల అక్కడ నెలక్నొ వాస్తవిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు తన నివేదికలో వివరించారు. దీనిపై పీపుల్స్ వరల్డ్ కరస్పాండెంట్ డబ్ల్యు.టి.విట్నే విశ్లేషించారు. దౌహాన్ ఇచ్చిన పూర్తి స్థాయి నివేదికను సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ప్రవేశపెడతారు. తక్షణమే వెనిజులాపై విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాల్సిన అవసరం ఎంతైనా వుందని దౌహాన్ స్పష్టం చేశారు. తృతీయ ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షలన్నింటికీ ఒకసారి సమీక్షించాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. ఈ ఆంక్షల వల్ల వారు వారి మౌలిక హక్కులను కూడా కోల్పోతున్నారని అన్నారు. కరోనా వంటి పరిస్థితులున్న నేపథ్యంలో కూడా వెనిజులాలో డాక్టర్లు, నర్సులు కొరతగా వున్నారని, పైగా తగిన మందులు, వైద్య పరికరాలు లేవని, వ్యాక్సిన్లు, పరీక్షా కిట్లు, విడిభాగాలు, ఇలా అన్ని రకాలుగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని దౌహాన్ తన నివేదికలో పేర్కొంది.
ఆంక్షల వల్ల కలుగుతున్న మానవతా సంక్షోభాలు, ప్రభావాలను పరిశీలించాల్సిందిగా 27మంది అమెరికన్ సెనెటర్లు, ప్రతినిధుల సభ్యులు ఈ నెల 11న అధ్యక్షుడు జో బైడెన్కు విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు అమలవుతున్న దేశాల పేర్లు ప్రత్యేకంగా వారు పేర్కోనప్పటికీ, ప్రస్తుతం అటువంటి దేశాల జాబితాలో పైన వున్నది వెనిజులానే. ట్రంప్ ప్రభుత్వ హయాంలో గత కొన్నేళ్ళుగా వెనిజులా అనేక కుట్ర యత్నాలను ఎదుర్కొంది. పైగా కుట్ర నాయకుడు జువాన్ గెయిడోనే వెనిజులా అధ్యక్షుడిగా అధికారికంగా అమెరికా ఇప్పటికీ గుర్తిస్తోంది.