Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది మృతి
క్విటో : మూడు ప్రాంతాల్లో జైళ్ళల్లో ఒకేసారి ఘర్షణలు జరిగాయని ఈక్వెడార్ పోలీసులు ధృవీకరించారు. జైలులో ప్రత్యర్థి ముఠాల మధ్య సోమవారం రాత్రి నుండి జరిగిన ఘర్షణల్లో 50మంది మరణించారు. రాజధాని క్విటోకి వాయవ్యంగా గుయాక్విల్లోని రెండు జైళ్ళలో ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలకు అదనంగా ఈ జైళ్ళలో 200మందికి పైగా పోలీసు అధికారులను మోహరించారు. క్యునెకాలోని ఎల్ తురి జైలులో 38మంది మరణించినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. అంబులెన్సులు మృతదేహాలను ఫోరెన్సిక్ సెంటర్లకు తరలించడం కనిపించింది. ఈ అల్లర్లకు క్రిమినల్ సంస్థలే కారణమని అధ్యక్షుడు లెనిన్ మోరెనో వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 48జైళ్ళలో 70శాతానికి పైగా జైలు అధికారులు(గైడ్) లేరని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఈ జైలు గైడ్లు ఒక్కొక్కరు సగటున 27మంది ఖైదీలను పర్యవేక్షించాల్సి వుంటుంది.