Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుజ : నైజీరియా అధ్యక్షుడిగా నైజీరియా పార్టీ ఫర్ డెమొక్రసీ అండ్ సోషలిజం అభ్యర్థి మహ్మద్ బజూమ్ ఎన్నికయ్యారు. ఈ నెల 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని మంగళవారం అధికారులు ధ్రువీకరించారు. స్వతంత్ర జాతీయ ఎన్నికల కమిషన్ (సిఇఎన్ఐ) వెల్లడించిన వివరాల ప్రకారం, బజూమ్కు 55.75 శాతం ఓట్లు లభించగా, ఆయన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఉస్మాన్కు 45.25శాతం ఓట్లు లభించాయి. ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, పదేళ్లపాటు పాలించిన మహ్మదు ఇస్సోఫో ప్రభుత్వాన్ని తొలగించి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు బజూమ్ ప్రభుత్వం అధికారం చేపట్టనున్నది. అయితే, నైజీరియా రాజ్యాంగ కోర్టు ఫలితాలను ఇంకా ధ్రువీకరించాల్సి వుంది. తీవ్రవాదంపై పోరాడతామని, దారిద్య్రాన్ని నిర్మూలిస్తామని బజూమ్ హామీ ఇచ్చారు.