Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : జనవరి 6న కేపిటల్ హిల్పై దాడి కేసులో సెనెట్ విచారణ మంగళవారం మొదలైంది. ఈ విచారణకు అమెరికన్ కాంగ్రెస్ ఉన్నతాధికారులు సాక్షులుగా హాజరయ్యారు. ఈ దాడిని నివారించడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని వారు ప్రధానంగా ఎత్తి చూపారు . ప్రతినిధుల సభ, సెనెట్ మాజీ సార్జెంట్లు పాల్ డి. ఇర్వింగ్, మైఖేల్ స్టెంజర్లు మంగళవారం సాక్ష్యమిచ్చారు. దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ ఉభయ సభల సమావేశంలో భద్రతా వ్యవహరాలు చూసిన అధికారులను, కాంగ్రెస్ సభ్యులను విచారించారు. కేపిటల్ హిల్ పై దాడికి సంబంధించి ఆరుగురు అధికారులను కేపిటల్ పోలీసులు సస్పెండ్ చేశారు. మరో 35మందిపై విచారణ జరుపుతున్నారు.