Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : లక్షా 9 వేల కోట్ల డాలర్ల కోవిడ్ రిలీఫ్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ శనివారం ఆమోదించింది. దీని ద్వారా అతలాకుతం అయిన జీవితాలతో ఆందోళన చెందుతున్న ప్రోగ్రెసివ్లకు కనీస వేతనాన్ని పెంచేందుకు తాము ప్రయత్నిస్తామని హామీ ఇచ్చేందుకు డెమోక్రాట్లు ప్రయత్నించారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న వ్యక్తులు, వ్యాపారాలు, రాష్ట్రాలు, నగరాలకు నగదు మొత్తాలను అందచేయడానికి ఈ బిల్లు ఉద్దేశించింది. సభలో 219-212 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోద ముద్ర పొందింది. ఈ బిల్లు తర్వాత సెనేట్కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అక్కడ కనీస వేతన డిమాండ్, రాష్ట్రాలకు సాయం, ఇతర అంశాలపై కోసం డెమోక్రాట్లు తీవ్రంగా పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.
దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, కరోనా మహమ్మారితో ఐదు లక్షల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ పరిస్థితుల్లో శీఘ్రగతిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డెమోక్రాట్లు చెబుతున్నారు. కాగా ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల రిపబ్లికన్ మాక్సిన్ వాటర్స్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాకు అవసరమైంది ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇతర రిపబ్లికన్లు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఒకవేళ ఎవరైనా కలిసిరాకపోతే వారు లేకుండానే తాము ముందుకు సాగుతామని అన్నారు. తక్షణమే స్కూళ్లు తెరిచేలా విద్యా రంగంపై కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ప్రతినిధుల సభలో కేవలం పది ఓట్లు తేడాతోనే బిల్లు ఆమోదం పొందడం, సెనెట్లో 50-50 తేడాలో విభజన రావడంతో తన పార్టీని ఒక తాటిపై నడిపించడంలో బైడెన్ శక్తిసామర్ధ్యాలకు ఇదొక పరీక్షగా నిలవనుంది.