Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు దశాబ్దాల దురాక్రమణ వైఖరి కొనసాగింపు
వాషింగ్టన్ : సిరియాపై అమెరికా వైమానిక బలగాలు బాంబు దాడులకు పాల్పడ్డాయని పెంటగన్ పత్రికా కార్యదర్శి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాక్లో అమెరికా, సంకీర్ణ బలగాలపై ఇటీవల జరిగిన దాడులకు ప్రతిగా ఈ దాడులు జరిగాయని ఆయన చెప్పారు. తూర్పు సిరియా, ఇరాక్ల్లో మొత్తంగా ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలకు దిగినట్లు ఆయన చెప్పారు. శాంతి చర్చల కోసం బాగ్దాద్ వచ్చిన ఇరాన్ జనరల్ ఖాసిం సోలెమనిని గతేడాది జనవరిలో అమెరికా హతమార్చింది. దాంతో తమ దేశం నుండి అమెరికా బలగాలను బహిష్కరించాలని కోరుతూ ఇరాకీ పార్ల మెంట్ ఓటు వేసింది. ఇరాకీ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనే ఈ పిలుపును పెడచెవిన పెట్టిన అమెరికా గత 20ఏళ్ళుగా అనుసరిస్తున్న వైఖరినే ఇప్పుడూ అనుసరించింది.