Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్చంద సంస్థల ఖండన
లండన్ : యెమెన్కు అందిస్తున్న సాయంలో బ్రిటన్ ప్రభుత్వం కోత విధించడాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు ఖండించాయి. ఈ మేరకు దాదాపు 100కి పైగా సంస్థలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు శనివారం ఒక లేఖ రాశాయి. పేదరికం, యుద్ధాలు, పలు వ్యాధులు బారిన పడుతున్న దేశాలకు దూరంగా జరిగితే ప్రజలు సంతోషంగా ఉంటారని అనుకుంటూ తప్పుగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. 2021లో బ్రిటన్ యెమెన్కు ఇచ్చే సాయాన్ని అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే తగ్గించి 8.7 కోట్ల పౌండ్లుగా పేర్కొంది. కాగా, ఈ సాయం 2019లో 20 కోట్ల పౌండ్లు, 2019లో 16 కోట్ల పౌండ్లుగా ఉంది. ఆయుధాల ఆమ్మకాలను కొనసాగిస్తోన్న బ్రిటన్.. ఇప్పుడు తన మానవతా సాయాన్ని 60 శాతం తగ్గించుకుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ లేఖపై ఆక్స్ఫామ్, క్రిస్టియన్ ఎయిడ్, సేవ్ ది చిల్డ్రన్ అండ్ కేర్ ఇంటర్నేషనల్ వంటి 100కు పైగా సంస్థలకు చెందిన ప్రతినిధులు సంతకాలు చేశారు. 'ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్' అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ యెమెన్లో ప్రారంభమైనప్పటి నుంచి తాము ఆహారం, మంచి నీరు, ఆరోగ్య సేవలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.