Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాగ్దాద్ : ఇరాక్లోని నజఫ్ నగరంలో శనివారం పోప్ ఫ్రాన్సిస్- షియా మతాధికారి గ్రాండ్ అయతోల్లాహ అలీ అల్-సిస్తాని మధ్య చారిత్రాత్మక సమావేశం జరిగింది. ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేయాలని శక్తివంతమైన సందేశం ఇచ్చారు. ఇరాక్లో క్రైస్తవులకు రక్షణ కల్పించే పాత్రను షియా మతాధికారులు తీసుకోవాలని, మిగిలిన ఇరాకీయులు మాదిరిగానే క్రైస్తవులు కూడా శాంతి, హక్కులతో జీవించాలని అల్-సిస్తాని తెలిపారు. శనివారం ఉదయం ముందుగా నజఫ్ నగరానికి చేరుకున్న పోప్కు ఇరాకీయులు సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. సిస్తాని నివాసంలోకి ప్రవేశించగానే శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరవేశారు. ఇద్దరి మధ్య సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో 40 నిమిషాల పాటు సాగిందని అధికారులు తెలిపారు.