Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటింగ్ను బహిష్కరించిన ప్రతిపక్షాలు
ఇస్లామాబాద్ : ప్రతిపక్షాల నిరసనలు, బహిష్కరణల మధ్య పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. బుధవారం జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి హఫీజ్ తన సమీప ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడంతో దీనికి నైతిక బాధ్యత వహించి ప్రధాని ఇమ్రాన్ తక్షణమే గద్దె దిగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆదేశాల మేరకు శనివారం నాడు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్లో మొత్తం 342 మంది సభ్యులకు గాను 178 మంది అనుకూలంగా ఓటు వేశారు. విశ్వాస పరీక్ష నెగ్గడానికి 172 ఓట్లు అవసరం కాగా, ఇమ్రాన్కు అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ బలపరీక్ష ఓటింగ్ను 11 ప్రతిపక్ష పార్టీలతో కూడిన పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్(పిడిఎం) బహిష్కరించింది.
సెనేట్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్ధి యూసఫ్ రజా గిలానీ 169 -164 ఓట్ల తేడాతో ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలోని పిటిఐ పార్టీకి చెందిన హఫీజ్ను ఓడించారు. దీంతో దేశంలోని రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి ఇమ్రాన్ఖాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో పార్లమెం దిగువసభలో విశ్వాస పరీక్షకు వెళ్లాలని ఇమ్రాన్ నిర్ణయం తీసుకున్నారు.