Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమల్లా: రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మంగళవారంనాడు పాలస్తీనా నుంచి ఇజ్రాయిల్ రానున్నారు. పాలస్తీనా - ఇజ్రాయిల్ మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో ప్రణబ్ పర్యటన సాగుతోంది. సోమవారం అమ్మాన్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్లోని బెన్-గురియన్ విమానాశ్రయంలో దిగిన ప్రణబ్..అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి పాలస్తీనా చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న బిటూనియా చెక్పోస్ట్ వరకూ ఇజ్రాయిల్ వాహనాల్లో వెళ్లిన ప్రణబ్ బృందం ఆ తర్వాత పాలస్తీనా వాహనాల్లోకి మారారు. చెక్ పాయింట్ దగ్గర ప్రణబ్కు పాలస్తీనా విద్యా మంత్రి సబ్రీ సైదాన్ స్వాగతం పలికారు. ఒక్కరోజు మాత్రమే పాలస్తీనాలో గడపనున్న రాష్ట్రపతి మంగళవారం ఇజ్రాయిల్కు తిరిగి వచ్చి మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తారు.