Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగ్రదాడుల నేపథ్యంలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లోని మెట్రో రవాణా సేవలను నిలిపివేశారు. ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని దేశ ప్రధాని చార్లెస్ మైఖేల్ తెలిపారు. ప్రజలు సమూహంగా ఉండకూడదని ఆయన సూచించారు. రద్దీ, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఆఫ్రికా దేశమైన మాలి రాజధాని బమాకోలోనూ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
పారిస్ దాడులకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం టర్కీ పోలీసులు ఓ బెల్జియం పౌరుడ్ని నిర్బంధించారు.
పారిస్ దాడులతో అతనికి సంబంధం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం ఐఎస్ ఉగ్రవాదులు పారిస్లో పలు చోట్ల దాడులకు తెగబడి 129 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.