Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 మంది మృతి
బీజింగ్ : చైనాలోని జినుహా బొగ్గుగనిలో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది చని పోయారు. ఒకరి ఆచూకీ తెలియరావటం లేదు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుందని హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్ స్థానిక ప్రభుత్వ అధికారులు, మీడియా శనివారం ప్రకటిం చాయి. ప్రస్తుతం జిన్హువా బొగ్గుగనిలో పరిస్థితులు అదుపులోనే వున్నాయని, మృతదేహాల్ని ప్రమాద స్థలి నుంచి బయటకు తీసుకొచ్చామని బొగ్గుగని అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆచూకీ తెలియని ఒక వ్యక్తి గురించి సహాయ సిబ్బంది వెదుకుతున్నారని అధికారులు తెలిపారు. బొగ్గుగనిలో అగ్నిప్రమాదం సంభవించిన సమ యాన, భూగర్భంలో 38 మంది పనిచేస్తున్నారని, 16 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయ టపడగలిగారని సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
శాంక్సీ ప్రావిన్స్లోని డాటాంగ్ నగరంలోని బొగ్గు గనిలోకి నీరు రావటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ ఘటనలో 21 మంది చని పోయారు. చైనా గనుల్లో కార్మికుల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యల్ని తీసుకుంటోంది. అయి నప్పటికీ అనూహ్యంగా గనుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2002నాటితో పోల్చుకుంటే బొగ్గుగని ప్రమాదాల్లో మరణాల సంఖ్య చాలా తగ్గింది.