Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్జియంలో మెట్రో రవాణా నిలిపివేత
బ్రస్సెల్స్ : పారిస్ ఉగ్రదాడి అనంతరం అధ్యక్షుడు హొలాండే ఫ్రాన్స్లో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. మరో మూడు నెలలపాటు ఎమెర్జెన్సీ విధింపుపై ఫ్రెంచ్ సెనెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సెనెట్ అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. నవంబరు 13 దాడి ఘటన ఫ్రాన్స్లో అనూహ్య పరిస్థితులకు దారి తీసింది. శాంతిభద్రతల పరిస్థితి చక్కదిద్దే క్రమంలో ఎమెర్జెన్సీని కొనసాగించే అవకాశముందన్న వార్తలు వెలువడ్డాయి.
పారిస్ ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతున్న సెన్స్, లోయెన్నే ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో కర్య్ఫూ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ట్రాఫిక్ నియంత్రణలు అమలులో వుంటాయని, భద్రతా బలగాల దాడులు కొనసాగుతాయని వార్తలు వెలువడ్డాయి. ఇప్పటివరకూ 793 ప్రాంతాల్లో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 174 అక్రమ ఆయుధాల్ని పట్టుకున్నారు. ప్రమాకరమైన, అనుమానాస్పద వ్యక్తులుగా పరిగణిస్తున్న 164 మందిని హౌస్ అరెస్టు చేశామని శనివారంనాడు సెనెట్లో ప్రధాని మాన్యువల్ వేల్స్ తెలిపారు.