Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ యంగ్ సామ్(87) శనివారం కన్నుమూ శారు.సియోల్ నేషనల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో తీవ్రమైన జ్వరంతో చేరారు. రక్తనాళాల్లో ఇన్ ఫెక్షన్,ఇతర ఆరోగ్యకారణాలతో హార్ట్ ఎటాక్తో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కిమ్ దక్షిణ కొరియా రాజకీయల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. సైనికపాలనకు వ్యతిరేకంగా ఉద్యమా లను నిర్మించారు. ప్రజా పోరాటాలను ముం దుండి నడిపించారు. 1997..98లో ఆసియ దేశాలు ఆర్థికసం క్షోభంలో కూరుకుపోయినప్పుడు ఆయన కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో వేళ్లూనుకున్న అవినీతి పై పొరాటం సలిపారు. ఇలా ఉద్యమనేతగా ఎదిగిన కిమ్ను అణగదొక్కెలా అమెరికా లాంటి దేశాలు ఎన్నో కుయుక్తులు, కుట్రలు పన్నినా కిమ్ తాను నమ్మిన ప్రజాపోరాటాలు,సిద్ధాంతాలను ఎన్నడూ విడలేదని దక్షిణకొరియా జనంలో వినిపిస్తున్నది.