Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టిబిలిసి: పులులు, సింహాలు, ఎలుగుబంట్లు... మొద లైన క్రూర జంతువులు జంతుశాల నుంచి జనారణ్యంలోకి వచ్చేస్తే..అమ్మో..ఇంకేమైనా వుందా ! జనాలు భయంతో వణికిపోవాల్సిందే. అలాంటి పరిస్థితిలోనే జార్జియా రాజధాని టిబిలిసి నగర ప్రజలు ఇప్పుడున్నారు. నగరంలోని ఓ జంతు ప్రదర్శనశాల నుండి జంతువులన్నీ తప్పించుకున్నాయి. ఇక్కడ కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తి జంతు ప్రదర్శనశాలలోని ఇనుపకంచెలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక క్రూర జంతువులు జంతుశాల నుంచి బయటకు వచ్చేసాయి. తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షాల తాకిడికి జూ తీవ్రంగా దెబ్బతింది. అయితే..భారీ వర్షాలు, గాలుల వల్ల ఎనిమిది మంది మనుషుల చనిపోయారా ? జంతువులు చంపాయా ? అన్నదానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభ్యం కాలేదని నగర మేయర్ డేవిడ్ నార్మేనియా మీడియాకు తెలియజేశారు.