Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 16న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర భేటీ
సియోల్: తమ దేశంలో మెర్స్ బాధితుల సంఖ్య 145కు చేరుకుందని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ తెలి పింది. దక్షిణ కొరియాలో ఆదివారం కొత్తగా ఏడు కేసులు నమోదు కాగా ఇప్పటివరకూ 15మంది చనిపోయారు. 2012లో ఈ వైరస్ను సౌదీ అరేబియాలో మొదటిసారిగా గుర్తించారు. దాంతో,ఈ వైరస్ సోకినవారిని మధ్యప్రాచ్చ శ్వాసకోశ వ్యాధి(మెర్స్) పీడితులుగా చెబుతున్నారు. మే 20న మధ్య ప్రాచ్యం నుంచి తమ దేశానికి వచ్చిన ఓ వ్యాపారి ద్వారానే ఇది వ్యాప్తి చెందుతోందని దక్షిణ కొరియా వెల్లడించింది. 2002-2003లో చైనా నుంచి వ్యాప్తి చెందిన సార్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 800మందిని బలితీసుకుంది. దాంతో, మెర్స్ వైరస్ పట్ల పలు దేశాలు ఇప్పటికే అప్రమత్తత ప్రకటించాయి. సౌదీ అరేబియాలో మొదటిసారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ ప్రపంచంలోని 20 దేశాల్లో మెర్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న మెర్స్ తీవ్రతపై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం అత్యవర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.